# Tags

అంగరంగ వైభవంగా నక్కలగుట్ట నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం

రాయికల్ : S. Shyamsunder మండలంలోని భూపతిపూర్ గ్రామంలో శ్రీ నక్కలగుట్ట నరసింహస్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం రోజు ఆలయ కమిటీ నిర్వాహకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేములవాడ రాజరాజేశ్వర పుణ్యక్షేత్ర అర్చకులు గిరిధరచార్యుల పర్యవేక్షణలో వెంకటరమణ, వెంకటకృష్ణ సమక్షంలో నృసింహస్వామి పూజలు అందుకున్నారు. కల్యాణ మహోత్సవ కార్యక్రమ అనంతరం భక్తులు వారి మొక్కులు చెల్లించుకొని తీర్థ ప్రసాదాలు,ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాలు స్వీకరించారు. సాయంకాల వేళ సతీ సమేతంగా నరసింహ స్వామి […]

శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ జూ. కళాశాలకు పేరు తేవాలి: హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు, వకీలు కాసుగంటి లక్ష్మణ్ కుమార్

ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించి శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పేరు తేవాలి: హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు, వకీలు కాసుగంటి లక్ష్మణ్ కుమార్ -ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కాసుగంటి కుటుంబం మరియు కళాశాల పూర్వ విద్యార్ధి జస్టిస్ పుల్ల కార్తిక్ నగదు పురస్కారాలను ప్రకటించిన కాసుగంటి  లక్ష్మణ్ కుమార్  ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించి శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పేరు తేవాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బార్ కౌన్సిల్ […]

రాయికల్ పట్టణంలో గ్రామీణ నిరుద్యోగ మహిళలకు మెగా జాబ్ మేళా

రాయికల్: పట్టణంలోని ఒక  ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం 10-30 నుండి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్ కు చెందిన  mnc కంపెనీ, ఏనుగు దయానంద రెడ్డి వసంత టూల్స్ క్రాఫ్ట్ కంపెనీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహిళలకు మెగా జాబ్ మేళా నిర్వహించారు. పలు గ్రామాల నుంచి సుమారు 50 మంది మహిళ అభ్యర్థులు పాల్గొనగా ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేశారు.. ఎంపికైన వారికి వేతనంతో పాటు ఉచిత వసతి రవాణా ఉంటుందని ప్రతి నిధులు […]

ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలి : డిఆర్డీవో రఘువరన్

రాయికల్ : S. Shyamsunder ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని జగిత్యాల డిఆర్డీవో రఘువరన్ అన్నారు. శుక్రవారం రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో జరుగుతున్న ఫారం పాండ్, హరితవనాలు,నర్సరీ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం కూలీలను గ్రూపుల వారిగా పిలిచి మస్టర్ రోల్ కాల్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరి డిమాండ్ తీసుకొని పని కల్పించాలన్నారు.ప్రతి గ్రామంలో […]

హైదరాబాద్ గచ్చీబౌలీలో విజ్ఞాన్ వైభవ్ -2025 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్ గచ్చీబౌలీలో విజ్ఞాన్ వైభవ్ -2025 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ : హైదరాబాద్ : ఈ దేశ రక్షణ బాధ్యత యువతీ యువకులపై ఉంది. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాలుగా దేశ రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది.బీడీఎల్, డీఆర్ డీఓ, మిదాని, హెచ్ఏఎల్ వంటి దేశ రక్షణ కోసం రాకెట్లు, మిస్సైల్స్ తయారు చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి హైదరాబాద్ నగరం, హైదరాబాద్ చుట్టూ పరిశ్రమలు ఉన్నాయి.దేశాన్ని రక్షించడంలో మన హైదరాబాద్ […]

పరిశోధన ఫలాలు – సమాజానికి జాతీయ సైన్స్ దినోత్సవం -2025

హైదరాబాద్ : (Reporter :ఎం. కనకయ్య ) By: BUNGA THIRUATHIResearch scholarOsamani University., 99898 07071 విజ్ఞాన శాస్త్రం మన జీవితాల్లో వెలుగులు నింపే దివ్యమైన శక్తి. ఈ ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు సర్ సివి రామన్. ఫిబ్రవరి 28 1928న రామన్ ఎఫెక్ట్ ను కనుగొని భౌతిక శాస్త్రంలో సరికొత్త అధ్యయనానికి నాంది పలికారు. ఆవిష్కరణకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 1986 నుంచి జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. సి.వి.రామన్ […]

ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల ఎన్నికల పోలింగ్, 72.5 శాతం పోలింగ్ నమోదు

 రాయికల్: S. Shyamsunder రాయికల్ పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం  ప్రశాంతంగా ముగిసింది. రాయికల్ పట్టణంలో మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా పట్టణంతోపాటు మండల వ్యాప్తంగామొత్తం 2175 పట్ట భద్రుల ఓటర్లకు గాను 1577 మంది వినియోగించుకోగా పురుషులు 951, మహిళలు 626  తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాయికల్ మండల వ్యాప్తంగా 72.5శాతం పోలింగ్ నమోదు అయింది.   ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఓటర్లు మండల వ్యాప్తంగా 66 మంది గాను 66 మంది […]

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

రాయికల్ : (S. Shyamsunder) బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో  జిల్లాలోని పలు చోట్ల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి.సత్య ప్రసాద్ పరిశీలించారు. రాయికల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత  పాఠశాల బాలుర, కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల, మేడిపల్లి జిల్లా ఉన్నత పాఠశాల  పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.  గురువారం జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్  కేంద్రాలలో ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందికి పలు […]

శ్రీ దుబ్బ రాజన్న కళ్యాణమహోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

మహా శివరాత్రి సందర్బంగా నియోజకవర్గంలోని పలు శివాలయాల్లో  ఉదయాత్పూర్వం నుండి అభిషేకాది పూజా కార్యక్రమాలు  -శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామి కళ్యాణమహోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ బుధవారం మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా జగిత్యాల నియోజకవర్గంలోని పలు శివాలయాల్లో అభిషేకాది పూజా కార్యక్రమాలు ఉదయాత్పూర్వం నుండి అర్చకులు, వేదంపండితుల మంత్రోచ్చరణల నడుమ వైభవంగా సాగుతున్నాయి. కాగా, మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా సాంప్రదాయబద్ధంగా, ఒకరోజు ముందు దుబ్బ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శివపార్వతుల […]

రాయికల్ త్రికూటాలయంలో శివరాత్రి వేడుకల ఏర్పాట్లు పూర్తి

రాయికల్ : ఎస్. శ్యాంసుందర్ బుధవారం మహాశివరాత్రిని పురస్కరించుకొని జగిత్యాల నియోజకవర్గం రాయికల్ మండల కేంద్రంలోని ప్రధాన శివాలయం త్రికూటాలయంలో శివరాత్రి వేడుకలకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తిగా గావించారు . అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తూ, శివుడిని కొలిచే శివరాత్రి ఉత్సవావేడుకల సందర్బంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయంలో అభిషేకాది పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ నిర్వాహకులు రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరించి ఆలయాన్ని ముస్తాబు గావించారు. మహాశివరాత్రి […]