# Tags

అక్రిడిటేషన్ కార్డుల గడువు మరో 3 నెలలు పొడిగింపు : సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్ ఎం.హనుమంతరావు అక్రిడిటేషన్ కార్డుల గడువును మరో మూడు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్రీడేషన్ కార్డుల గడువును 01-10-2024 నుంచి 31-12-2024 వరకు పొడిగిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్టీసీ సంస్థకు సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్ ఎం.హనుమంతరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్ లకు, డి […]

తెలంగాణ ప్రభుత్వ ‘ప్రవాసీ ప్రజావాణి’ తో గల్ఫ్ వలస జీవులకు ఓదార్పు, మనో ధైర్యం

◉ గల్ఫ్ కార్మికులకు కష్టమొస్తే… ఇక్కడ హైదరాబాద్ లో చెప్పుకోవచ్చు ! ◉ భారత విదేశాంగ శాఖతో… తెలంగాణ ప్రభుత్వం సమన్వయం (మంద భీంరెడ్డి) విదేశాల్లో పనిచేసే మన కార్మికుల బాధలను వారి కుటుంబ సభ్యుల ద్వారా హైదరాబాద్ బేగంపేట లోని ప్రజాభవన్ లో ‘ప్రవాసీ ప్రజావాణి’ లో విన్నవించుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. 2024 సెప్టెంబర్ 27న మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్న ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోనున్నది. గల్ఫ్ తో పాటు ఇతర […]

ఎల్లారెడ్డిపేట మండల విద్యాశాఖ అధికారిగా గాలిపెల్లి కృష్ణహరి నియామకం

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన “గాలిపెల్లి కృష్ణ హరి”మొదటగా ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామంలో ఉపాధ్యాయులుగ చివరగా రాచర్ల తిమ్మాపూర్ “జిల్లా పరిషత్ హై స్కూల్” లో ప్రధానోపాధ్యాయులుగా చురుకుగా పనిచేసి, ప్రస్తుతం ఎల్లరెడ్డిపేట్ మండల విద్యాధికారిగా నియామకం అయ్యారు,DEO A. రమేష్ కుమార్ MEO నియామక పత్రాన్ని కృష్ణహరి కి అందజేశారు,ఇటీవలే ఉపాధ్యాయుల దినోత్సవం రోజు జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా కూడా అవార్డు అందుకున్నారు మండలంలోని విద్యార్థిని విద్యార్థులకు […]

ఎల్లారెడ్డిపేట,గొల్లపల్లి సమస్యలపై ఆది శ్రీనివాస్ కు వినతి

రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలంగాణ రిపోర్టర్ :(సంపత్ కుమార్ పంజ) ఎల్లారెడ్డిపేట,గొల్లపల్లి కి చెందిన పలు సమస్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎల్లారెడ్డి పేటలో 1993వ సంవత్సరం లో కిషన్ దాస్ పేట నుండి నంది విగ్రహం వరకు సీసీ రోడ్డు నిర్మించారు.అది పూర్తిగా […]

ఇందిరా మహిళా శక్తితో ఆర్థిక ప్రగతిప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..

తెలంగాణ రిపోర్టర్ (సంపత్ కుమార్ పంజ): రుద్రవరం లో ఇందిరా మహిళా శక్తి యూనిట్లు ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఇందిరా మహిళా శక్తి పథకంతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.. బుధవారం వేములవాడ పట్టణంలో బ్యూటి పార్లల్, వేములవాడ రూరల్ మండలం రుద్రవరం గ్రామంలో ఓపెన్ జిమ్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు..అనంతరం ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా అంబేద్కర్ స్వయం […]

కాళేశ్వరం అభివృద్ధి కోసం త్వరలో మాస్టర్ ప్లాన్ : దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్యర్

కాళేశ్వరం అభివృద్ధి కోసం త్వరలో మాస్టర్ ప్లాన్ : దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్యర్ కాళేశ్వర-ముక్తేశ్వర ప్రధాన ఆలయం, ప్రాంగణ విస్తరణ, ఆలయ పునరుద్ధరణ, భక్తులకు సౌకర్యాలు, అతిథి గదులు, భోజనశాల, పార్కింగ్ స్థలం, స్వచ్ఛమైన తాగునీరు వంటి పలు అంశాలను మాస్టర్ ప్లాన్‌లో పొందుపరచాలని అధికారులను దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్యర్ ఆదేశించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం కాళేశ్వరంలోని శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం పూజలు […]

కామారెడ్డిలో జీవదాన్ స్కూల్ వద్ద ఉద్రిక్త వాతావరణం…

కామారెడ్డిలో ఉద్రిక్త వాతావరణం… ఆరేళ్ల చిన్నారితో పీఈటీ అసభ్యంగా ప్రవర్తించిన విషయం వెలుగుచూడడంతో మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియతోపాటు నాయకులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. మంగళవారం ఉదయం పాఠశాలకు చేరుకొని ధర్నా నిర్వహించారు. చిన్నారులకు భద్రత లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ ఎదుట బైటాయించిన చైర్ పర్సన్ డీఈవోకు ఫోన్ చేసి ఈ ఘటనపై మాట్లాడారు. స్కూల్ కు వచ్చి విచారణ చేపట్టాలని, లేనిపక్షంలో తాము విద్యాశాఖ కార్యాలయానికి వస్తే పరిణామాలు వేరే ఉంటాయని […]

మెగా లోక్ అదాలత్ సేవలను వినియోగించుకోవాలి

-గొడవలు వద్దు-రాజీలే ముద్దు : ఎస్.ఐ ఎల్లారెడ్డిపేట -నేటి నుండి 28వ తారీకు వరకు ఎల్లారెడ్డిపేట,sampath p: రాజీ పడదగిన కేసులో ఉన్నవారు రాజమార్గం ద్వారానే పరిష్కరించుకోవడమే మంచిదని, దీని ద్వారా సమయం వృధా కాదని కక్షలు,కారుణ్యాలు తగ్గుతాయని తద్వారా స్నేహభావం పెంపొందుతుందని ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ తెలిపారు. మీ ఉచిత న్యాయ సేవ అధికార సంస్థ తేదీ 23-09-2024 నుండి 28-09-2024 వ తారీకు వరకు సిరిసిల్ల జిల్లా కోర్టులో *మెగా లోక్ అదాలత్* ఉందని […]

గంగాధర లో కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన శాఖ ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్

కరీంనగర్ :కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన శాఖను చొప్పదండి నియోజకవర్గం గంగాధర ఎక్స్-రోడ్‌లో ఆదివారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్, బ్యాంకు పర్సన్ ఇంచార్జ్ చైర్ పర్సన్ లక్ష్మీ కిరణ్,డీసివో రామానూజాచార్యులు, ఆర్డీఓ మహేశ్వర్, సిఈఓ శ్రీనివాస్, వ్యక్తిగత సభ్యులు విలాస్ రెడ్డి, లక్ష్మణ్ రాజు, ఎండీ సమీయుద్దీన్ (జగిత్యాల), మంగి రవిందర్ (జగిత్యాల),ఎం. మోహన్, చుక్క భాస్కర్, బీరం ఆంజనేయులు, ఖలీంఖాన్, రేగొండ సంపత్, […]

కార్యకర్త కుటుంబానికి సహాయాన్ని అందించిన బిజెవైఎం నాయకులు

కార్యకర్త కుటుంబానికి సహాయాన్ని అందించిన బిజెవైఎం నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో ఇటీవల గణపతి నిమజ్జనంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మరణించిన బిజెవైఎం కార్యకర్త న్యాలకొండ రాకేష్ (18) కుటుంబానికి బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మానుక కుమార్ యాదవ్ 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువ కార్యకర్త మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది అని విచారం వ్యక్తం చేశారు. రాకేష్ కుటుంబ […]