గల్ఫ్ మృతుల వారసులకు ఎక్స్ గ్రేషియా మంజూరి పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
జగిత్యాల జిల్లా కొడిమ్యాల: (నర్రా రాజేందర్): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఇద్దరు గల్ఫ్ మృతుల ఇళ్లను సోమవారం సందర్శించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గల్ఫ్ మృతుల వారసులకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా మంజూరి పత్రాలు (ప్రొసీడింగ్స్) అందజేశారు. త్వరలో వీరి బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వ ట్రెజరీ ద్వారా సొమ్ము నేరుగా జమ అవుతుంది. డబ్బు తిమ్మయ్యపల్లి గ్రామానికి చెందిన యదరవేణి రవీందర్ మార్చి 27న దుబాయిలో మరణించగా అతని భార్య మౌనికకు, […]



