# Tags

వైద్య సిబ్బంది ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించాలి : జిల్లా వైద్యాధికారి రజిత

( తెలంగాణ రిపోర్టర్):- జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చీర్లవంచ లోని బస్వాపూర్ మరియు ఇల్లంతకుంట మండలములోని పెద్దలింగాపూర్ గ్రామాలని జ్వరాల నియంత్రణలో భాగముగా తనిఖి నిర్వహించి రికార్డులను పరిశీలించి ఆరోగ్య కార్యక్రమాలపై మరియు కాలానుగుణ వ్యాదుల పై ఆరోగ్య సిబ్బంది తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో వైద్య సిబ్బంది ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించడం, అనుమానిత జ్వర పిడితులను గుర్తించి వారి నుండి రక్త నమూనాలను సేకరించి […]

అసంపూర్తి పనులు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

మధ్యాహ్న భోజనం గ్యాస్ స్టౌలపై సిద్దం చేయాలి : ( తెలంగాణ రిపోర్టర్ : సంపత్ పంజా): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న గదుల నిర్మాణాలను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్, రాగట్లపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న […]

జీఎస్టీ కౌన్సిల్‌ కీలక నిర్ణయాలు..

ఢిల్లీ:   సిమెంట్‌పై జీఎస్టీ 28 నుంచి 18 శాతానికి తగ్గింపు,  చేనేత, మార్బుల్, గ్రానైట్‌పై 5 శాతం జీఎస్టీ,  33 ఔషధాలపై జీఎస్టీ 12 నుంచి సున్నాకి తగ్గింపు, కార్బొనేటెడ్ కూల్‌డ్రింక్స్‌,జ్యూస్‌లపై 40శాతం GST,  పాన్‌, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులపై 40% GST, బొగ్గుపై జీఎస్టీ 5 నుంచి 18 శాతానికి పెంపు,  చేనేత వస్తువులపై 5 శాతం జీఎస్టీ, కళ్లద్దాలపై జీఎస్టీ 28 నుంచి 5 శాతానికి తగ్గింపు,  పునరుత్పాదక ఇంధన వస్తువులపై పన్ను […]

పశువులను నీటి ప్రవాహ ప్రదేశాలకు తీసుకువెళ్లవద్దు : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

వరద ప్రవాహానికి దెబ్బతిన్న రహదారుల మరమ్మతుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.. గంభీరావుపేట మండలంలోని భారీ వర్షాలు, వరద ప్రవాహంతో దెబ్బతిన్న రోడ్లు, మిషన్ భగీరథ పైపులైన్లు, విద్యుత్ లైన్ ల పరిశీలన… గంభీరావుపేట, భారీ వర్షాల నేపథ్యంలో మానేరు ప్రవహించే గ్రామాల రైతులు, పశువుల యజమానులు మూగజీవాలను నీరు పారే ప్రాంతాలకు తీసుకువెళ్ళవద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. ఇటీవల భారీ వర్షాలు, వరదల ప్రవాహంతో గంభీరావుపేట మండలంలో దెబ్బతిన్న రోడ్లు, మిషన్ భగీరథ పైపులైన్లు, […]

సెప్టెంబర్ 9 న ఛలో హైదరాబాద్ -ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ

రాయికల్: ప్రభుత్వంపై పెన్షన్ దారులు తాడో పేడో తెలుసుకునేందుకు సెప్టెంబర్ 9న హైదరాబాద్ లక్షల మంది తరలిరావాలని, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మాదిగల ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. రాయికల్ మండల కేంద్రంలో శివాజీ రెడ్డి గార్డెన్ లో జరిగిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేయూత పెన్షన్ దారుల సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథిగా మంద కృష్ణ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ…. వికలాంగులకు 6 వేలు, సమస్త […]

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు :SI రాహుల్ రెడ్డి

(తెలంగాణ రిపోర్టర్): సంపత్ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామం వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను స్టేషన్ హౌస్ ఆఫీసర్ షబ్బీర్ హుస్సేన్, హెడ్ కానిస్టేబుల్ పట్టుకున్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు చూపించనందున అదుపులోకి తీసుకున్నారు. పంచనామా నిర్వహించి అట్టి ట్రాక్టర్ డ్రైవర్ ని ఇసుక ట్రాక్టర్ తో సహా పోలీస్ స్టేషన్ కు తరలించగా ఎల్లారెడ్డిపేట ఎస్సై కె. రాహుల్ రెడ్డి కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ […]

మిడ్ మానేరు లోనీళ్లు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టువే కాళేశ్వరం నీళ్లు కాదు :కాంగ్రెస్ నాయకులు

(తెలంగాణ రిపోర్టర్): తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష కోట్లు దోసుకోడానికే కాళేశ్వరం కట్టారనికాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డ రామచంద్రం , ఎడ్ల రాజ్ కుమార్ లు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డ రామచంద్రం మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలతో మిడ్ మానేరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటితో నిండి పోతే కాలేశ్వరం నీళ్లతో నిండి పోయిందని బిఆర్ఎస్ పార్టీ […]

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు,రిటైర్డ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ అఫ్ స్కూల్స్ రాంపల్లి కిష్టయ్య (98) మృతి

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు,రిటైర్డ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ అఫ్ స్కూల్స్ రాంపల్లి కిష్టయ్య 98 సం॥నిన్న రాత్రి 11-35 ని॥లకు హైదరాబాద్ లో వృద్ధాప్యం కారణంగా మృతి చెందారు. (File Photo: రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళిసై చే సన్మానం…) వారి అంతిమ సంస్కారం సోమవారం మధ్యాహ్నం మంథని గోదావరి తీరంలో జరుగుతుంది. … రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్ర సంతాపం: ఈ సందర్భంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు రాంపల్లి కిష్టయ్య మృతి పట్ల మంథని […]

ఐ మాస్ లైట్ ను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేరా బేగం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని గుండారం గ్రామంలో ఎస్డిఎఫ్ నిధుల కింద లక్ష రూపాయలతో ఏర్పాటు చేసిన ఐ మాస్ లైట్ ను ఆదివారం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేరా బేగం ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ , గుండారం గ్రామంలో నాలుగు లక్షల రూపాయలతో ప్రాథమికోన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం చేయడం జరిగిందన్నారు అదేవిధంగా పైప్ లైన్ నిర్మాణం కూడా చేశామన్నారు సుమారు 30 […]

తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారసులదే..సీనియర్ సివిల్ జడ్జ్ వెంకట మల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ

తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారి వారసులే తీసుకోవాలని జగిత్యాల జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జ్ వెంకట మల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ అన్నారు. జగిత్యాల జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని నివేదిత వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధాశ్రమాల్లో వయోవృద్ధుల న్యాయ సేవా కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ప్రభుత్వ చట్టాలపై, వయోవృద్ధుల సంరక్షణ పథకాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. వృద్ధాశ్రమంలోని మౌలిక వసతులను పరిశీలించి సలహాలు అందించి వృద్ధుల సమస్యలను అడిగి తెలుసుకొని […]