# Tags

భారత్ ఆతిథ్యం అదిరింది: పుతిన్ – రష్యా మనకు ఎప్పటినుంచో మిత్రదేశం: మోదీ

భారత్ ఆతిథ్యం అదిరింది: పుతిన్ భారత్ పర్యటనలో భాగంగా కుదిరిన ఒప్పందాల అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడారు. ‘భారత్ ఆతిథ్యం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అనేక అంశాల్లో ఇరు దేశాల మధ్య అవగాహన కుదిరింది. భారత్-రష్యా మధ్య 64B డాలర్ల వ్యాపారం జరుగుతోంది, దీన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తున్నాం. ఆయిల్, అణువిద్యుత్, విద్యుత్, మెడిసినల్ డ్రగ్స్ రంగాల్లో ఇండియాతో కలిసి పనిచేస్తాం’అని వెల్లడించారు. రష్యా మనకు ఎప్పటినుంచో మిత్రదేశం: మోదీ భారత్, రష్యా […]

త్వరలోనే మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

త్వరలోనే మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర సంవత్సరాల్లో మొత్తం లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు’ లో భాగంగా హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో […]

కరీంనగర్ జిల్లా పోరాట సమితి సభ్యులు ముందస్తు అరెస్ట్ – విడుదల

బెజ్జంకి : హుస్నాబాద్ సీఎం సభకు వెళ్లి, బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలపాలని వినతి పత్రం ఇవ్వడానికి వెళుతున్న మానాల రవి, దోనె వెంకటేశ్వర్ రావు తదితరులను బెజ్జంకి పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అరెస్ట్ విషయం తెలుసుకున్న పోరాట సమితి సభ్యులు, మద్దతుదారులు పోలీస్ స్టేషన్ కు తరలివచ్చి పోలీసుల తీరును ఖండించారు. కాగా ముఖ్యమంత్రి బహిరంగ సభ అనంతరం వారిని సాయంత్రం విడుదల చేశారు. ప్రజాభిప్రాయానికి వ్యతరేకంగా కరీంనగర్ జిల్లాలో ఉన్న బెజ్జంకి […]

కోరుట్ల కాంగ్రెస్ ఖాతాలో మూడో సర్పంచ్

కోరుట్ల నియోజకవర్గం. మెట్ పల్లి మండలం. చింతలపేట గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి తోట్ల చిన్నయ్య, ఉప సర్పంచ్ గా బోత్కూరి లింగారెడ్డి ఏకగ్రీవ ఎన్నిక.. ఈ సందర్బంగా కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగ్ రావు ను ఏకగ్రీవ సర్పంచ్ తోట్ల చిన్నయ్య. ఉప సర్పంచ్ బోత్కూరి లింగారెడ్డి లు మర్యాదపూర్వకంగాకలిశారు. ఈ సందర్భంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు శుభాకాంక్షలు తెలిపి […]

రెడ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ గా దురిశెట్టి మనోహర్ నియామకం

తెలంగాణ రాష్ట్ర పునరుద్దరణీయ ఇంధన వనరుల సంస్థ (రెడ్కో) ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేనేజర్ గా రిటైర్డ్ ఏడీఈ దురిశెట్టి మనోహర్ ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఏడాదికాలం పాటు కొనసాగుతారు. విద్యుత్ సంస్థలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించిన అనుభవం, వినియోగదారులు, రైతులతో విస్తృత పరిచయాలు ఉండటం వల్ల హరిత ఇంధన ఉత్పత్తి లో పీఎం-సూర్యఘర్, పీఎం-కుసుమ్, ఈవీ- ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, తదితర ప్రభుత్వ పథకాల అమలు, సోలార్ […]

నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల గ్రామ పంచాయతీ ఎన్నికలు సమర్దవంతంగా నిర్వహించాలి 7 మండలాల్లోని 144 గ్రామాలు, 1276 వార్డులకు రెండవ విడత నామినేషన్ల స్వీకరణ ముగింపు – జగిత్యాల జిల్లాలో 144 గ్రామాలు, 1276 వార్డులకు రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ చివరి రోజు డిసెంబర్ 2 తో ముగియనున్న నేపథ్యంలో రాయికల్ మండలం వడ్డె లింగపూర్, కొత్తపేట మరియు అల్లీపూర్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లోని నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ […]

ధాన్యం కొనుగోలు ప్రక్రియ పగడ్బందీగా చేపట్టాలి:అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్ లత

జగిత్యాల. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పగడ్బందీగా చేపట్టాలని, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని అలసత్వం వహించకూడదని జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత నిర్వాహకులకు సూచించారు. సోమవారం జగిత్యాల రూరల్ మండలంలోని జాబితాపూర్ మరియు ధర్మారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను, పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లత […]

తెలంగాణ రైజింగ్-2047 దార్శనిక పత్రాన్ని త్వరలోనే జాతికి అంకితం చేయబోతున్నాం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రభుత్వం గతాన్ని ఒక అనుభవంగా, ఆ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో భవిష్యత్తుకు స్పష్టమైన ప్రణాళికలను రచించుకుని అద్బుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో రూపొందించిన తెలంగాణ రైజింగ్-2047 దార్శనిక పత్రాన్ని త్వరలోనే జాతికి అంకితం చేయబోతున్నామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో భవిష్యత్తులో రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడానికి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకోవడానికి తెలంగాణ రైజింగ్ 2047 (Telangana Rising 2047) […]

రాయికల్ యువకుడికి వైద్య విభాగం లో మాస్టర్ డిగ్రీ :ఎండీ ఫిజీషియన్ గా పి. లోకేష్ చంద్ర

రాయికల్ పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీ, ఆర్ఎంపీ వైద్యులు,మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు పిప్పోజీ మహేందర్ బాబు తనయుడు పిప్పోజి లోకేష్ చంద్ర …వైద్య విభాగం లో మాస్టర్ డిగ్రీ పట్టా సాధించాడు. డా.లోకేష్ చంద్ర రాయికల్ పట్టణంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు,హైదరాబాదులోని నారాయణ కళాశాలలో ఇంటర్ విద్య,అలాగే మెడిసిటీ కళాశాలలో ఎంబిబిఎస్ సీటు సాధించి చదువు పూర్తి చేసి,అదే కళాశాల నుండి మాస్టర్ డిగ్రీ ఎండి ఫిజీషియన్ గా పట్టా సాధించాడు. […]

జీపీ ఎన్నికల ఫేజ్–1 నామినేషన్లకు నేడే ఆఖరు:ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల, (సంపత్ పంజా): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలో ఫేజ్ – 1 నామినేషన్ల దాఖలుకు నేడు శనివారం సాయంత్రం 05.00 గంటల వరకు గడువు ఉందని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి ఫేజ్ లో రుద్రంగి మండలంలో 10 సర్పంచ్, 86 వార్డు సభ్యులు, వేములవాడ అర్బన్ మండలంలో 11 సర్పంచ్, 104 వార్డు సభ్యులు, వేములవాడ రూరల్ మండలంలో 17 సర్పంచ్, […]