# Tags

ఢిల్లీలో ఓసి ల మహా ధర్నా విజయవంతం – ఓసి ఐకాస జాతీయ,రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు

న్యూ ఢిల్లీ : ఓసి ల మహా ధర్నాకు అనూహ్య స్పందన, విజయవంతం చేసిన ఓసి ఐకాస జాతీయ రాష్ట్ర నాయకుల కు ప్రత్యేక కృతజ్ఞతలు : ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సంపూర్ణంగా పటిష్ట అమలుకు జాతీయ స్థాయి ఓసి కమిషన్ . ఏర్పాటు చేయాలనీ , రైతుకు గిట్టుబాటు ధరకు రైతు భాగస్వామ్యం ఉండే చట్టం […]

ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి, లేదంటే ఉద్యమమే : మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులు ఇచ్చి హెల్త్ పాలసీ అమలు చేయాలని మీడియా అకాడమీ మాజీ చైర్మన్, టీయూ డబ్ల్యూ జే రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో జర్నలిస్టులు పోరాడి సాధించుకున్న హెల్త్ కార్డును, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం టీయూడబ్ల్యూ […]

ప్రకృతి వైపరీత్యంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

రాయికల్ : ఎస్. శ్యామ్ సుందర్ : ఆరుకాలం కష్టపడి పండించిన పంట కోతకు వచ్చే దశలో పకృతి వైపరీత్యంతో అకాల వర్షం,ఈదురు కాలులతో పంట నష్టపోయిన మొక్కజొన్న,మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి ఈదురు గాలులు, అకాల వర్షంతో నేలకొరిగిన మొక్కజొన్న, మామిడి పంటలను రాయికల్ మండలంలోని రామజిపేట్ గ్రామంలో మంగళవారం క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్,వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి […]

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త….రాష్ట్ర మంత్రిమండలి తీర్మాణం

హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు పూర్తి భద్రత, భరోసా కల్పించేందుకు రెండు కొత్త పథకాలకు ఆమోదం తెలిపింది. ❇️ ఉద్యోగుల ప్రమాద బీమా పధకం :▪️ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఒక్క రూపాయి ప్రీమియం […]

వాళ్లు మూగజీవాల దేవుళ్ళు వారు…. వైద్యో నారాయణో హరి

కరీంనగర్ : (ముడికే కనకయ్య) : వైద్యులు కేవలం నోరున్న మనుషులకే కాదు నోరులేని మూగజీవాలకు సైతం వైద్యం చేస్తూ, నయం చేస్తున్న డాక్టర్లు మాటలున్న మనుషులకు, మాటలు రాని మూగజీవాలకు సైతం వారు దేవుళ్లే అని చెబుతూ వారిని వైద్యో నారాయణో హరిః అని పోల్చక తప్పదు. కరీంనగర్ జిల్లా పశు వైద్యశాల సీనియర్ డాక్టర్ ఎం రామస్వామితో పాటుగా ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న మరో పశు వైద్యుడు డాక్టర్ కుంబోజు రమేష్ లు నిత్యం తాము విధులు […]

రాజకీయ రణరంగంలా మారిన జగిత్యాల పురపోరు…

రచయిత: ఎడిటర్: సిరిసిల్ల శ్రీనివాస్, తెలంగాణా రిపోర్టర్ దిన పత్రిక  ఎవరు నిలదొక్కుకుంటారో, ఎవరు తలదించుతారో, జగిత్యాలను చేజిక్కించుకునేది ఎవ్వరో,  జగిత్యాల ఓటరు గెలిపించేది ఎవ్వరినో…. హూ విల్ విన్ దిస్ గేమ్…వెయిట్ అండ్ సీ…. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల నియోజకవర్గం ముందు నుంచి ఒక రాజకీయ రణ రంగానికి వేదికగా మారుతుంది. ఈ నేపథ్యంలో రాజకీయ రణరంగం అని ఎందుకు అనవలసి వస్తుందంటే, జగిత్యాల పురపోరులో అన్ని పార్టీల మధ్య పోటాపోటీలు […]

తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా జగిత్యాలలో 21 అడుగుల శ్రీ వెంకటేశ్వర స్వామి 3డీ సైకత శిల్ప ప్రదర్శన

ఓం నమో వెంకటేశాయ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి సమితి ఆధ్వర్యంలో…వేముల ఉమారాణి నిర్వహణలో, వేద పండితులు, జగిత్యాల శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం అనువంశిక అర్చకులు నంబి వేణుగోపాలచార్య  మంగళాశాసనములతో…తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా జగిత్యాల జిల్లా కేంద్రంలో 21 అడుగుల కలియుగ వెంకటేశ్వర స్వామి 3డీ సైకత శిల్ప ప్రదర్శన ప్రారంభమయ్యింది. స్వామివారి ప్రదర్శనను వేదోక్తంగా నంబి వేణుగోపాలచార్య ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.  ఈ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్. రమణ తో పాటుగా పలువురు పట్టణ […]

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్బంగా ఐల్నేని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహనా సదస్సు

జిల్లా కేంద్రంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్బంగా క్యాన్సర్ పై అవగాహనా సదస్సు క్యాన్సర్ గురించి అవగాహన పెంపొందించడానికి, దాని నివారణ, గుర్తింపును, చికిత్సను ప్రోత్సహించేందుకు ప్రతి ఏట ఫిబ్రవరి 14న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా గుర్తిస్తారు. క్యాన్సర్ వలన అనారోగ్యం, మరణాలు తగ్గించడమే దీని లక్ష్యం. ఈ సందర్బంగా ఐల్నేని హాస్పిటల్స్ వారి సౌజన్యంతో బుధవారం అవగాహన సమావేశం నిర్వహించారు .  ఈ కార్యక్రమంలో Medical ఆంకలోజిస్ట్ డా: వంశీ చేతన, ఐల్నేని హాస్పిటల్, Genaral surgeon డా.సుమన్ రావు, మరియు డా.వినీల పాల్గొని, […]

ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలి : మంత్రి శ్రీధర్ బాబు 

పెద్దపల్లిలో :   ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలనీ, పట్టణంను మరింత అభివృద్ధి చేసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి ప్రజలను కోరారు. మున్సిపల్ ఎన్నికల సందర్బంగా బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గోల్డెన్ తులిప్ బ్యాంకెట్ హాల్ల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు …పెద్దపల్లి శాసనసభ్యులు  “ విజయరమణ రావుతో కలిసి మాట్లాడారు.  ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… పట్టణంలో అనేక సంక్షేమ […]

మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం…

జగిత్యాల : -మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ దక్కడం లేదన్న నైరాష్యం, -సముదాయించిన జీవన్ రెడ్డి  -మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పరిస్థితి వివరించిన జీవన్ రెడ్డి  జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ బి-ఫారం పంచాయితీ సోమవారం రాత్రి వరకు కూడా ఎటూ తేలకపోవడంతో,  కౌన్సిలర్ అభ్యర్తిగా నామినేషన్ వేసిన ఓ కాంగ్రెస్ కార్యకర్త  పార్టీ టికెట్ రాదేమోనన్న అనుమానం తోఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నా నికి పాల్పడడంతో  వాతావరణం ఒక్క సారి వేడెక్కింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే, జగిత్యాల మున్సిపల్ […]