# Tags

ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న నాయకులనే మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలి : ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

రాయికల్, ఎస్ శ్యామ్ సుందర్ : ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి పనిచేస్తున్నవారినే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు గెలిపించాలని పట్టణంలోని ప్రగతి హైస్కూల్ లో ఆదివారం నిర్వహించినవిలేఖరుల సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా రాయికల్ మున్సిపల్ పరిధిలోని అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యే మాట్లాడారు.రాయికల్ పురపాలక సంఘం అభివ్రుద్దికి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నానని అన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లో గతంలో పని చేసిన కాంట్రాక్టర్ లకు […]

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులిస్తాం : రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు భారీగా తగ్గిస్తున్నట్లు వస్తున్న వదంతుల్లో ఎలాంటి వాస్తవం లేదని, అయితే ఎంతో గౌరవప్రదమైన అక్రెడిటేషన్ కార్డులను దుర్వినియోగం చేస్తున్న వారి ఆగడాలకు మాత్రం ఖచ్చితంగా బ్రేక్ వేసి, అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులు అందించేలా పగడ్భందీ చర్యలు చేపడతామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేసారు. శనివారం సచివాలయంలోని తన ఛాంబర్ లో, మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, సమాచార శాఖ […]

పుట్టి పెరిగిన పల్లె ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో గొప్పనైనది: ఆర్డిఓ కే.మహేశ్వర్

పుట్టి పెరిగిన పల్లె ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో గొప్పనైనదని కరీంనగర్ ఆర్డిఓ కే మహేశ్వర్ అన్నారు. శనివారం సమైక్య సాహితీ ఆధ్వర్యంలో కోట్ల నరసింహులపల్లిలో జరిగిన ‘వేణుశ్రీ’ రెండు పుస్తకాలు ‘నాయక శతకం’ మరియు ‘నేను నా పల్లె’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కోట్ల నరసింహుల పల్లె ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశమని ఇలాంటి చక్కని పరిసరాల్లో ఈ పుస్తకాల ఆవిష్కరణ జరగడం సంతోషంగా ఉందన్నారు. సాహిత్యం […]

యువ ఐఏఎస్ అధికారి అనుదీప్ కు బిట్స్ పిలానీ యంగ్ అచీవర్స్ అవార్డ్ ప్రదానం చేసిన మంత్రి శ్రీధర్ బాబు

జగిత్యాల, జనవరి 10 : ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థుల నుండి జ్యూరీ కమిటీ అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో భాగంగా మెటుపల్లి వాసి, యువ ఐఏఎస్ అధికారి, ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ని పబ్లిక్ లైఫ్ కేటగిరీ లో ప్రతిభావంతమైన సేవలు చేస్తున్నందుకు గాను ‘యంగ్ అచీవర్స్ అవార్డు’ ను రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అందజేశారు. అనుదీప్ ప్రస్తుతం […]

దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు అభయ్ రాజ్ ప్రదర్శన ఎంపిక

రాయికల్,ఎస్.శ్యామ్ సుందర్ : :రాయికల్ మండలం కుమ్మరిపెల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు అభయ్ రాజ్ రూపొందించిన వైజ్ఞానిక ప్రదర్శన దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు శుక్రవారం సాయంత్రం ఎంపికైంది. కామారెడ్డి జిల్లాలోని విద్యా నికేతన్ పాఠశాలలో గత మూడు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఉపాధ్యాయుడు కడకుంట్ల అభయ్ రాజ్ రూపొందించిన సూపర్ సైన్స్ కిట్ ఉపాధ్యాయ బోధనోపకరణాల విభాగంలో దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైంది. అత్యంత ప్రతిభ చూపిన అభయ్ […]

డ్రగ్స్‌ మరియు మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

రాయికల్ : ఎస్. శ్యామ్ సుందర్ : డ్రగ్స్‌, మాదకద్రవ్యాల మహమ్మారిని సమాజం నుండి పూర్తిగా నిర్మూలించి భావితరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు. బుధవారంమధ్యాహ్నం3 గంటలప్రాంతంలో రాయికల్ మండల కేంద్రంలో గల ఆర్ఆర్ గార్డెన్స్ లో జిల్లా పోలీస్ శాఖ మరియు రాయికల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో […]

మాజీ మంత్రి జీవన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కుటుంబసమేతంగా ఆలయాల్లో పూజలు to

జగిత్యాల జంబిగద్దె ఆంజనేయ స్వామి ఆలయంలో మరియు కొండగట్టు అంజన్నసన్నిధిలో, స్థానికమార్కండేయ ఆలయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా వెళ్లి పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయా ఆలయాల్లో ఆలయాల నిర్వాహకులు, అర్చకులు స్వాగతం పలికి, పూజలా అనంతరం అర్చకులు ఆశీర్వచనములు అందించగా, నిర్వాహకులు స్వామి వారల ప్రసాదములందజేసి, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డికి పలువురు నాయకులు, కార్యకర్తలు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. Sircilla SrinivasSircilla […]

తాట్లవాయి ఉన్నత పాఠశాలలో సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు

రాయికల్ :ఎస్.శ్యామ్ సుందర్ : తాట్లవాయి ఉన్నత పాఠశాలలో సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బోగ రమేష్ మాట్లాడుతూసావిత్రి బాయి పూలే కు ఈనాటి మన భారతదేశ ప్రజలు రుణపడి ఉన్నారని,ఆనాడు మహిళల పట్ల సమాజం యొక్క కట్టుబాట్లు,అణిచివేత,నిరక్షరాస్యత,అసమానతలకు వ్యతిరేకంగా తన భర్త జ్యోతిరావు పూలే సహకారంతో సామాజిక ఉద్యమం చేసిన ధీరవనిత, బాలికల విద్యకొరకు భారతదేశంలో మొట్టమొదటి పాఠశాలను స్థాపించిన మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి అన్నారు. […]

35.19 కోట్ల రూ.టీటీడీ నిధులతో కొండగట్టు క్షేత్రంలో అభివృద్ధి పనులకు శంఖు స్థాపన చేసిన ఆంధప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 

సిరిసిల్ల శ్రీనివాస్ : -కొండగట్టు గిరిప్రదక్షిణకు సహకరిస్తా, కరసేవ చేస్తా…పవన్ కళ్యాణ్ -అంజన్న అజ్ఞ , భక్తులు కోరుకున్న బలమైన సంకల్పంతోనే టీటీడీ ద్వారా ఇది సాధ్యమయ్యింది కొండగట్టు అంజన్న నా ప్రాణదాత, స్వామి వారి అజ్ఞ , భక్తులు కోరుకున్న బలమైన సంకల్పంతోనే ఈరోజు కొండగట్టు క్షేత్రంలో టీటీడీ ద్వారా అభివృద్ధిపనులు చేపట్టడానికి సాధ్యమయ్యిందన్నారు.  బ్యూరోక్రాట్ లో మనసున్నా కూడా కొన్ని పనులు చేయడం ఒక్కో సారి కుదరదు, కానీ ఇంత పెద్ద ఎత్తున కొండగట్టు క్షేత్ర అభివృద్ధి చేస్తున్నామంటే అది స్వామి వారి అనుగ్రహం, […]

తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే జయంతి : మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు

తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్న – మంత్రి పొన్నం ప్రభాకర్ దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక విప్లవకారిణి, స్త్రీ విద్యకు మార్గదర్శకురాలు అయిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన నివాళులు అర్పించారు. సావిత్రిబాయి పూలే ఒక వ్యక్తి మాత్రమే కాదు—ఆమె ఒక ఉద్యమమని, మహిళలకు విద్య అవసరం లేదన్న అంధ […]