# Tags

మాకు న్యాయం చేయండి బుడగ జంగాల ఆవేదన…

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో గత 20 సంవత్సరాలుగా నివాసముంటున్న బుడగ జంగాల వర్గంప్రజలు తమకు అధికారులు అన్యాయం చేయొద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి అనేక సేవలు అందిస్తున్నామని తమకు ఆధార్ కార్డు, రేషన్ కార్డుతోపాటుగా ఓటు హక్కు కూడా పోతిరెడ్డిపల్లిలోనే ఉందని బుడగజంగాలు తెలిపారు. ప్రస్తుతం ఉంటున్న మా గుడిసెలను ఖాళీ చేయించి అడవిలోకి పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ,గ్రామ సభ్యులు కలిసి అటవీ లో […]

మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చేతులమీదుగా వింధ్య గౌరవ్ జాతీయ అవార్డు అందుకున్న మహిళా ఆడియో ఇంజనీర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత డా.సాజిదాఖాన్

హైదరాబాద్ : మొదటి మహిళా ఆడియో ఇంజనీర్ మరియు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డు గ్రహీత,  డాక్టరేట్ పొందిన కుమారి సాజిదా ఖాన్ ఈ జనవరి 16న మధ్యప్రదేశ్, భోపాల్‌లో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో వింధ్య గౌరవ్ జాతీయ అవార్డు సీజన్ 5 – 2026ను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర శుక్లా మరియు మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుండి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వాహకులు స్నేహ ఈవెంట్ అండ్ మేనేజ్‌మెంట్స్ & శివి ఎంటర్‌ప్రైజెస్ విష్ణు మిశ్రా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ […]

జీవో 25తో లింక్ చేయకుండా, జీవో 190ని అమలు చేయాలి: సియస్ రామకృష్ణరావు ను కోరిన తపస్ నాయకులు

జీవో 25తో లింక్ చేయకుండా 317 జీవో బాధిత ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగేలా జీవో 190ని పూర్తిగా అమలు చేయాలి.సియస్ రామకృష్ణరావు ను కోరిన తపస్ ఉపాధ్యాయ సంఘం నాయకులు…. 317 జీవో బాధిత ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగేలా ఇచ్చిన జీవో 190 ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని తపస్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి వొద్నాల రాజశేఖర్, తెల్కలపల్లి పెంటయ్య,ఆర్గనైజింగ్ సెక్రటరీ హన్మంత్ రావులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ను కల్సి ప్రాతినిధ్యం సమర్పించారు. […]

విద్యార్థుల్లో చదువుతో పాటు ఆటల్లో సామర్ధ్యాలు పెంపొందించాలి:జిల్లా తనిఖీ బృందం నోడల్ ఆఫీసర్ కే. లక్ష్మన్న

రాయికల్ : ఎస్. శ్యామ్ సుందర్ : విద్యార్థుల్లో చదువు తో పాటు ఆటల్లో సామర్ధ్యాలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా తనిఖీ బృందం నోడల్ ఆఫీసర్ కోమ్మిడి లక్ష్మన్న సూచించారు. రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు ,బాలికలు ,ఉర్దూ మీడియం పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాలను జిల్లా ప్యానల్ తనిఖీ బృందం బుధవారం పరిశీలించింది. తనిఖీలో భాగంగా పాఠశాలలోని విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు రికార్డుల నిర్వహణ మార్కుల వివరాలను ఆన్లైన్లో నమోదు […]

రాయికల్ ప్రెస్ క్లబ్ (JAC) అధ్యక్ష,ఉపాధ్యక్షులుగా సాయికుమార్,కిరణ్ బాబు శ్యాంసుందర్…

రాయికల్ : ఎస్.శ్యామ్ సుందర్ : పట్టణంలోని ప్రెస్ క్లబ్ జేఏసీ కార్యాలయంలో మంగళవారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా గంగాధరి సురేష్, కళ్ళెం శ్రీనివాస్, ఎద్దండి జితేందర్ రెడ్డి, తీగుళ్ళ గోపాల్ రెడ్డి, కనికరపు లక్ష్మణ్, గౌరవ అధ్యక్షులు సయ్యద్ రసూల్, పర్యవేక్షకులుగా గుర్రాల వేణు, పటేల్ నరేందర్, నాగమల్ల శ్రీకర్ లు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులుగా చింతకుంట సాయికుమార్, ఉపాధ్యక్షులుగా యాచమనేని కిరణ్ బాబు, సింగని శ్యాంసుందర్, […]

తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దైవదర్శనం కోసం 116 మంది చాకుంట విద్యార్థులకు సహకరించిన ఆత్మీయులకు సత్కారం

కరీంనగర్ : తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దైవదర్శనం కోసం 116 మంది చాకుంట విద్యార్థులను, ఉపాధ్యాయ బృందమును ఇతర సిబ్బందితోపాటు తల్లిదండ్రులను మరియు తమ కుటుంబ సభ్యులను తిరుమల తిరుపతి దైవ దర్శనం పంపించడానికి గాను సహకరించిన అలనాటి ధన్గర్ వాడి పాఠశాల పూర్వ విద్యార్థులుగా పాఠశాల పునర్నిర్మానంతో పాటు ముందుండి నడిపించిన ప్రముఖులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు  మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, ప్రముఖ గ్రానైట్ వ్యాపారవేత్త తిరుపతి గౌడ్, మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్, న్యాయవాది […]

భీమేశ్వర ఆలయంలో పూజలు, కోడె మొక్కు చెల్లించుకున్న మంత్రి సీతక్క

వేములవాడ : సంపత్ పంజా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ, పర్యవేక్షణతో నిధులు…. వేములవాడలో రాజన్న ఆలయ విస్తరణ, మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణం : మంత్రి సీతక్క భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి, విస్తరణ పనులను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేయిస్తుందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ, గ్రామీణ నీటి పారుదల, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. వేములవాడ పట్టణంలోని శ్రీ […]

బీసీలకు 3 నగరాలు, 38 పట్టణాలు… మున్సిపల్​ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు

పట్టణ స్థానిక సంస్థల మేయర్లు, ఛైర్‌పర్సన్లకు రిజర్వేషన్ల ఖరారు స్థానాల వారీగా 17న కొలిక్కి పాటించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ… మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణలో భాగంగా తెలంగాణలో 10 నగరపాలక సంస్థలు, 121 పురపాలక సంఘాలకు పురపాలక శాఖ రిజర్వేషన్లను ఖరారు చేసింది. రిజర్వేషన్ల ఖరారులో పాటించాల్సిన మార్గదర్శకాలను కూడా విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని మొత్తం 10 కార్పొరేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున, బీసీలకు […]

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వొడ్నాల రాజశేఖర్

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ రాష్ట్ర అధ్యక్షుడిగా వొడ్నాల రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంలో జగిత్యాల జిల్లా తపస్ కుటుంబ సభ్యులు బుధవారం రాజశేఖర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తపస్ జిల్లా అధ్యక్షుడు బోయినపల్లి ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి కొక్కుల రాజేష్ లు మాట్లాడుతూ… వొడ్నాల రాజశేఖర్ తపస్ సంఘంలో సామాన్య కార్యకర్త నుండి మండల అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వివిధ హోదాల్లో పనిచేస్తూ, రాష్ట్ర […]

బెజ్జంకిలో గోదా రంగనాథ కళ్యాణం

బెజ్జంకి : (ముడికే కనకయ్య): మండల కేంద్రంలో గుడి వద్ద లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం గోదాదేవి శ్రీ రంగనాయకుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అశేష భక్తజనులు ఈ కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా తిలకించి పరవశించారు. ఆలయ అర్చకులు శేషం మధుసూదనాచార్యులు కళ్యాణాన్ని నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ఆలయ కమిటీ చైర్మన్ జెల్ల ప్రభాకర్ యాదవ్ దంపతులు, బెజంకి గ్రామ సర్పంచ్ బొల్లం శ్రీధర్ ( పెద్దన్న) దంపతులు పట్టు వస్త్రాలు, ఓడి బియ్యం […]